Andhra PradeshHealthHome Page SliderNews Alert

ఏపీ హాస్టల్ విద్యార్థులకు “గోల్డెన్ అవర్”

ఏపీ రాష్ట్రంలో సంక్షేమ వసతిగృహాలలోని విద్యార్థుల ఆరోగ్యం కోసం ‘గోల్డెన్ అవర్ బీమా’ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో తొలిసారిగా కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేశ్‌కుమార్‌ చొరవతో ఈ కార్యక్రమం జిల్లాలో అమలుచేయాలని  నిర్ణయించారు. దీనికోసం ఐసీఐసీఐ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుని ఏడాదికి రూ.200 ప్రీమియంతో రూ.50 వేల రూపాయల బీమా సదుపాయం కల్పిస్తున్నారు. ఈ ప్రీమియం సొమ్మును కూడా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ‘వేదాంత’ సంస్థ నుండి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. దీనికోసం ఏడాదికి రూ.20 లక్షల వరకూ ఖర్చు అవుతోంది. కోనసీమ జిల్లాలో 94 హాస్టళ్లలో 8,384 మంది పిల్లలకు బీమా సదుపాయం చేకూరనుంది. ఈ పిల్లలకు ఏ రకమైన ఆరోగ్యసమస్యలు వచ్చినా ఈ ఆరోగ్య బీమా సహాయంతో చికిత్స అందించవచ్చు. జ్వరాలు, దెబ్బలు, యూరినరీ ఇన్‌ఫెక్షన్లు, చర్మ సమస్యలు వంటి 20 రకాల వ్యాధులను ఈ బీమాలో చేర్చారు.