Home Page SliderNational

రాజస్థాన్‌లో ఇంటిపైకి కూలిన మిగ్-21 జెట్

ఇంటిపైకప్పుపై కూలిన మిగ్
ముగ్గురు గ్రామస్తులు మృతి
పారాచూట్‌తో ప్రాణాలు కాపాడుకున్న పైలట్

రాజస్థాన్‌లో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన MIG-21 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటిపై కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో చోటుచేసుకుంది. పైలట్ పారాచూట్ ఉపయోగించి సకాలంలో విమానం నుండి దూకాడని, సురక్షితంగా ఉన్నాడని అధికారులు తెలిపారు.