గాలివానకు కూలిన భారీ రథం
బెంగళూరులో గాలివానకు 150 ఫీట్ల ఎత్తు ఉన్న ఓ భారీ రథం నేలకొరిగింది. దొడ్డనగమంగల గ్రామంలో భక్తులు ఈ భారీ రథాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా రథం నేలకొరిగింది. ఈ ఘటనలో ఓ భక్తుడు మృతి చెందాడు. రథం వెంట భక్తులు వేల సంఖ్యలో ఉన్నట్లు అక్కడి వారు చెబుతున్నారు.

