Home Page SliderNational

కోల్‌కతాకు కొత్త పోలీస్ కమిషనర్‌

పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం మంగళవారం కోల్‌కతా పోలీస్ కొత్త కమిషనర్‌గా మనోజ్ కుమార్ వర్మను నియమించింది. నిరసన తెలుపుతున్న వైద్యులతో అర్థరాత్రి సమావేశమైన అనంతరం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వినీత్ గోయల్‌ను తొలగించే నిర్ణయాన్ని ప్రకటించారు. వర్మ, 1998 బ్యాచ్ IPS అధికారి, అతని తాజా నియామకానికి ముందు పశ్చిమ బెంగాల్‌లో అదనపు డైరెక్టర్ జనరల్ (ADG), లా అండ్ ఆర్డర్‌గా పనిచేస్తున్నారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ)గా వినీత్ కుమార్ గోయల్ బదిలీ చేశారు. ఆగస్టు 9న ప్రభుత్వ ఆధీనంలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం మరియు హత్య జరిగిన ఘటనపై కమిషనర్ గోయల్‌పై వైద్యులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారి నిరసనలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అతడిని తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య విద్యార్థులతో జరిపిన ఐదు డిమాండ్లలో మూడింటిని అంగీకరించినట్లు ముఖ్యమంత్రి మమత పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్, హెల్త్ సర్వీస్ డైరక్టర్‌లను వారి పోస్టుల నుండి తప్పించారు.