మరోసారి పంచ్ పవర్ చూపించిన తెలంగాణ బాక్సర్..
తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి తన సత్తా చాటింది. అద్భుతమైన విజయంతో ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. భోపాల్ వేదికగా జరిగిన జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో 50 కిలోల విభాగం ఫైనల్లో నిఖత్ 4-1 తేడాతో రైల్వేస్ క్రీడాకారిణి అనామికను చిత్తుగా ఓడించి మరోసారి ఛాంపియన్గా నిలిచింది. ఈ ఏడాది ఆరంభంలో స్ట్రాంజా మెమోరియల్ టోర్నమెంట్లో పసిడి గెలిచిన నిఖత్ తర్వాత ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఆపై, కామన్వెల్త్ క్రీడల్లోనూ పసిడి పతకం సొతం చేసుకుంది. అయితే నిఖత్ ఇప్పుడు జాతీయ ఛాంపియన్ షిప్ కూడా గెలిచి అందరీ మన్ననలు పొందింది.

