Andhra PradeshHome Page Slider

టీటీడీ ఈవో (ఎఫ్.ఎ.సి)గా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు

అనిల్ కుమార్ సింఘాల్  టీటీడీ ఈవో ఫుల్ అడిషనల్ చార్జ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. బంగారు వాకిలి వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. సింఘాల్‌ను అదనపు ఈఓ(ఎఫ్.ఎ.సి) వీరబ్రహ్మం ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు.