ఓదెల రైల్వేస్టేషన్ 2 షూటింగ్ లో విషాదం.. బీజేపీ నేత మృతి
రంగారెడ్డి జిల్లా టంగటూర్ లో జరిగిన ఓదెల రైల్వే స్టేషన్ పార్ట్ 2 షూటింగ్ లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో శంకర్ పల్లి బీజేపీ నాయకుడు శంబారెడ్డి అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందారు. సినిమా షూటింగ్ కోసం లొకేషన్ చూపిస్తుండగా ప్రమాదం సంభవించింది. అయితే.. శాంబా రెడ్డి మృతిపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ షాక్ తో చనిపోయి ఉంటే తమకు తెలియకుండానే మృతదేహాన్ని పోలీసులు తీసుకెళ్లడం, మృతిపై ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, డెడ్ బాడీని పోస్టుమార్టానికి తరలించడం ఏంటని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిలదీశారు. మోకిలా పీఎస్ లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోవడం లేదని కుటుంబసభ్యులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటనకు ఓదేలు రైల్వే ష్టేషన్ పార్ట్ 2 సినిమా డైరెక్టర్ అశోక్ కుమార్, ప్రొడ్యూసర్ ప్రశాంత్ సత్య బాధ్యత వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

