జూన్ 4న కౌటింగ్ రోజు అలర్ట్గా ఉండండి… ఏజెంట్లకు సజ్జల హెచ్చరికలు
జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని.. ప్రతిపక్ష పార్టీల కౌంటింగ్ ఏజెంట్లపై కూడా నిఘా ఉంచాలన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార పార్టీ కౌంటింగ్ ఏజెంట్లకు వర్క్షాప్ నిర్వహించారు. వర్క్షాప్ సందర్భంగా, భారత ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా కౌంటింగ్ కేంద్రం లోపల చేయవలసినవి, చేయకూడని విషయాలను వివరించారు. వర్క్షాప్లో సజ్జల మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన కౌంటింగ్ ఏజెంట్లు మీ దృష్టిని మరల్చి మోసగించ్చని అన్నారు. ఎన్నికల్లో భారీ విజయంతో పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని… 2024 జూన్ 9న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని సజ్జల పునరుద్ఘాటించారు. ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు, వైఎస్సార్సీపీ లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులు, ఎన్నికల పరిశీలకులు వర్క్షాప్కు హాజరయ్యారు.