అవమానించడమే నా అరెస్టు ఏకైక లక్ష్యం: అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ హైకోర్టులో బెయిల్ విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ‘‘అరవింద్ కేజ్రీవాల్ను కించపరచడమే ఈ అరెస్టు ఏకైక ఉద్దేశమన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్పై విరుచుకుపడ్డారు, “నన్ను అవమానపరచడం.. నన్ను అసమర్థుడిని చేయడమే అరెస్టు ఏకైక ఉద్దేశ్యం” అని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్కు సంబంధించి గత నెలలో ఈడీ అరెస్టు చేసింది. ఏప్రిల్ 15 వరకు ఢిల్లీ తీహార్ జైలుకు కోర్టు పంపించింది. ఈ రోజు తనను బెయిల్పై విడుదల చేయాలని కోర్టును కేజ్రీవాల్ కోరారు.