News AlertTelangana

ఆయన ఎందుకు రాలేదో నాకు తెల్వదన్న గవర్నర్

Share with

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాజ్ భవన్ వేదికగా తేనేటి విందు (ఎట్ హోం) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హజరుకాలేదు. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి హజరవుతున్నట్టు సమాచారం అందినా చివరి నిమిషంలో రద్దు అయినట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్,సీఎస్ సోమేశ్ కుమార్, ప్రభుత్వ ఉన్నత అధికారులు,ఇతర ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వెళ్లకపోవడంతో అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరుకాలేదు.

కేసీఆర్‌ హాజరు కాకపోవడంపై గవర్నర్‌ తమిళిసై స్పందిస్తూ.. సాయంత్రం 6:55కు సీఎం కేసీఆర్‌.. రాజ్‌భవన్‌కు చేరుకుంటారని సీఎంవో కార్యాలయం నుంచి రాజ్‌భవన్‌కు సమాచారం అందిందని చెప్పారు. కానీ, సీఎం ఎందుకు రాలేదో తనకు తెలియలేదు అన్నారు గవర్నర్ తమిళసై. కనీసం రావడం లేదన్న సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంవో కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో దాదాపు 30నిమిషాల పాటు వేచి చూసి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గవర్నర్ చెప్పారు.

అతిథులందరికి పలకరింపు

గవర్నర్ తమిళసై నిర్వహించిన తేనేటి విందు కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. స్వాతంత్య సమరయోదులు,పద్మశ్రీ అవార్డు గ్రహీతలు,వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న ప్రముఖ వ్యక్తులు, ఇంజనీర్లు, డాక్టర్లు,స్వచ్ఛంద సేవకులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కాగా గవర్నర్‌ అతిథులందరి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. మహరాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, బీజేపీ ఎంపీ డి.అరవింద్, ఎమ్మెల్యే రఘునందన్‌ రావు, సీనియర్‌ నేత ఇంద్రసేనారెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, ఎంఐఎం ఎమ్మెల్సీ అమీనుల్‌ జాఫ్రీ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే కరోనా కారణంగా తేనేటి విందుకు హజరుకాలేకపోతున్నానని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి గవర్నర్ కార్యాలయానికి సమాచారం పంపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రలో ఉండడంతో హాజరుకాలేదు. ‘కనెక్ట్‌ ది చానల్సర్‌’ కార్యక్రమం కింద వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన 75 మంది విద్యార్థులకు గవర్నర్‌ తమిళసై పురస్కారాలు ప్రదానం చేశారు.