ఏపీ పదో తరగతి పరీక్ష విధానంలో కీలక మార్పు
పదో తరగతి పరీక్షా విధానంలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. 6 పేపర్లతో పదో తరగతి పరిక్షలు నిర్వహించే పద్దతిని, సీబీఎస్ఈ సిలబస్లో కూడా అమలులోనికి తీసుకురావాలని నిర్ణయించి నట్టు విద్యాశాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ విద్యా విధానాన్ని 2022-23 సంవత్సరం నుండి అమలులోనికి తీసుకురానున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది.

