Home Page SliderNational

మార్కెట్ లో మహీంద్రా జియో

ఆటోమేకర్ మహీంద్రా జియో పేరుతో ఎలక్ట్రిక్ కమర్షియల్ స్మాల్ వెహికల్ ను లాంచ్ చేసింది. అర్బన్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ కోసం పెరుగుతున్న డిమాండును తీర్చడానికి దీనిని రూపొందించింది. ఈ వెహికల్ లో 21.3 కిలోవాట్ అవర్ లిక్విడ్-కూల్డ్ బ్యాటరీ ఉంటుంది. మోటార్ 30 కిలోవాట్ల శక్తిని, 114 ఎన్ఎం టార్క్ ను విడుదల చేస్తుంది. గరిష్టంగా గంటకు 60 కిలో మీటర్ల వేగంతో వెళ్తుంది. పేలోడ్ సామర్థ్యం 765 కిలోల వరకు వరకు ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 160 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మహీంద్రా జియో ధర రూ.7.52 లక్షలు (ఎక్స్-షోరూమ్).