ఎవరడ్డొచ్చినా, కేంద్రంలో మళ్లీ వచ్చేది మోదీ సర్కారే
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన నమో యాప్ వికసిత్ భారత్ అంబాసిడర్ క్యాంపెయిన్ వర్క్ షాప్ కార్యక్రమాంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడారు ప్రధాని మోదీ ప్రభుత్వానిదేనన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో, సుపరిపాలనతో పాటు అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. మోదీ నాయకత్వంలో అద్భుత సంస్కరణలు తీసుకువచ్చారని. అనేక ఘనతలు సాధించారన్నారు. జమ్ము కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక సమస్యలను పరిష్కరించుకోవడం జరుగుతోందన్నారు. స్వదేశంలోనే వ్యాక్సిన్ ను తయారుచేసుకునేలా దోహదపడ్డారన్నారు. శ్రీరామజన్మభూమి అయోధ్యలో జనవరి 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగుతోందన్నారు. 500 ఏండ్లుగా అయోధ్య రామమందిర పునర్ నిర్మాణం కోసం వేలాది మంది ప్రాణత్యాగం చేశారన్నారు. బానిస మనస్తత్వానికి ప్రతీకగా ఉన్న బ్రిటీషు హయాంలోని 500 చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాలను తెచ్చుకున్నామన్నారు. బాబరు కూలగొట్టిన రామమందిరాన్ని రక్తపుబొట్టు చిందకుండా ప్రశాంత వాతావరణంలో, ఆధ్యాత్మిక, ఉత్సాహవంతమైన, క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో పున:ప్రారంభించుకుంటున్నామన్నారు.

వచ్చే 25 సంవత్సరాలు భారతదేశపు అమృతకాలమని… భారతదేశంలోని యువత ప్రపంచమంతా రాణిస్తున్నారన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందేలా కృషి చేస్తోందన్నారు. 2047వ సంవత్సరం వరకు భారతదేశం ప్రపంచంలో విశ్వగురు స్థానంలో నిలవాలనేది మన లక్ష్యమన్నారు కిషన్ రెడ్డి. నరేంద్ర మోదీ ప్రభుత్వం అభివృద్ధి ఫలాలు, ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలను ప్రతి ఒక్కరికి చేరువ చేయడమే వికసిత భారత్ సంకల్ప్ యాత్ర లక్ష్యమన్నారు కిషన్ రెడ్డి. ప్రభుత్వ పథకాలు.. సేవలు ప్రతి ఒక్కరికి అందించడమే వికసిత భారత్ లక్ష్యమన్నారు. దేశంలో కొన్ని కుటుంబ పార్టీలు ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నాయని, వాటి నుంచి విముక్తి చెందేలా మార్పు రావాలన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మెచ్చుకుంటూ అమెరికా నుంచి రష్యా వరకు అనేక దేశాల అధిపతులు పొగడ్తలు కురిపిస్తున్నారన్నారు. గతంలో నరేంద్ర మోదీకి వీసా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందో.. నేడు అదే అమెరికా వైట్ హౌస్ లో మోదీకి అద్భుతరీతిలో సత్కరించి స్వాగతించిందన్నారు.

నరేంద్ర మోదీ సుపరిపాలనను అందిస్తూ.. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేలా, యువతను ప్రోత్సహించేలా, భారతీయ సంస్కృతిని, జీవన విధానాలను భావితరాలకు తీసుకెళ్లాలా, యోగాను ప్రపంచదేశాలకు తీసుకెళ్లేలా పాలన అందిస్తున్నారన్నారు కిషన్ రెడ్డి. 2047 వరకు భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ప్రతిఒక్కరం వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ప్రజలు… నేను సైతం నరేంద్ర మోదీతో అంటూ వికసిత్ భారత్ లో పాల్గొంటూ అంబాసిడర్ గా నిలుస్తున్నారన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ మరింత అభివృద్ధి చెందాలనే సంకల్పంతో వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రతిఒక్కరిని భాగస్వామ్యం చేసేలా పనిచేయాలన్నారు. ఎంతమంది ఓవైసీలు, రాహుల్ గాంధీ లు అడ్డొచ్చినా… మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వమే వస్తుందన్నారు. ఎవరూ ఊహించనిరీతిలో అద్భుత మెజారిటీతో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. దేశంలోని యువత అంతా మోదీ మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.

