ఢిల్లీ కొత్త పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా నియామకం
తమిళనాడు కేడర్కు చెందిన 1988-బ్యాచ్ IPS సంజయ్ అరోరా, దేశ రాజధాని పోలీసు దళానికి నాయకత్వం వహించడానికి ఎంపికయ్యారు. ITBP చీఫ్బాధ్యతల నుంచి ఆయన ఢిల్లీ పోలీస్ కమిషనర్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. తమిళనాడు కేడర్కు చెందిన ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి సంజయ్ అరోరా, రాకేశ్ అస్థానా తర్వాత ఢిల్లీ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. జూలై 31, 2025 వరకు, లేదంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకారం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగొచ్చు. సశాస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్… SL థాసేన్ ప్రస్తుతానికి ITBPకి అదనపు బాధ్యతగా వ్యవహరిస్తారు.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2022/07/image-566-1024x680.png)
సంజయ్ అరోరా అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం ప్రాంతాల కేడర్ వెలుపల నుండి దేశ రాజధాని పోలీసు దళానికి అధిపతిగా నియమించిన మూడో అధికారి మాత్రమే. 1984-బ్యాచ్ IPS అధికారి అయిన రాకేష్ అస్థానా జూలై 2021లో నియమితులయ్యారు, అయితే 1966-బ్యాచ్ ఉత్తరప్రదేశ్-క్యాడర్ IPS అధికారి అయిన అజయ్ రాజ్ శర్మ 1999లో ఈ పదవిని పొందారు. IPSలో చేరిన తర్వాత, మొదట్లో తమిళనాడులో వివిధ హోదాల్లో పనిచేశారు, డకాయిట్ వీరప్పన్, అతని ముఠాకు వ్యతిరేకంగా టాస్క్ఫోర్స్లో కీలకంగా వ్యవహరించాడు. సీఎం గ్యాలెంట్రీ మెడల్ లభించింది.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2022/07/image-567-1024x680.png)
ITBPలో పనిచేస్తున్న సమయంలో 2000 నుండి 2002 వరకు ముస్సోరీలోని ఫోర్స్ అకాడమీలో అధ్యాపకుడిగానూ పనిచేశారు. కోయంబత్తూరు నగరంలో పోలీసులకు హెడ్గా కొనసాగాడు మరియు చెన్నైలో క్రైమ్ మరియు ట్రాఫిక్కు అదనపు కమిషనర్గా వ్యవహరించాడు. గతేడాది ఆగస్టులో ఐటీబీపీకి అధిపతి అయ్యాడు. అతను విశిష్ట సేవ కోసం రాష్ట్రపతి పోలీసు పతకం, UN శాంతి పరిరక్షక పతకాన్ని పొందాడు.