బీఏసీ సమావేశానికి ఎందుకు పిలవట్లేదు
బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలున్నప్పుడు బీఏసీ సమావేశానికి స్పీకర్ ఎందుకు పిలవలేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. రాజాసింగ్ ఒక్కరున్నప్పుడు బీఏసీ సమావేశానికి పిలిచారని, ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటే బీఏసీ సమావేశానికి పిలుస్తారో చెప్పాలన్నారు. ఈ అసెంబ్లీ పదవీ కాలంలోపే అంతమందిని తెచ్చుకుంటామని తెలిపారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి మూడు రోజుల్లో సభను ముగించాలనుకుంటున్నారని రఘునందన్రావు అన్నారు.

