Andhra PradeshHome Page Sliderviral

హస్టల్ గదిలో విద్యార్థినులకు ఏం జరిగిందంటే..

అనంతపురంలోని ప్రభుత్వ మహిళా కాలేజి హాస్టల్‌లో విద్యార్థినులకు పెద్దకష్టమే వచ్చింది. హాస్టల్లో నిద్రిస్తున్న 10 మంది విద్యార్థినులను కాళ్లపై, చేతులపై ఎలుకలు కొరికాయి. వారు ఉదయం లేచి చూసేసరికి, కాళ్లకు, చేతులకు గాయాలు ఉండడంతో భయపడి టీచర్లకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన ప్రిన్సిపల్ రహస్యంగా వారికి టీకాలు వేయించారని చెప్తున్నారు. హాస్టల్ వెనుక డ్రైనేజ్ నుండి ఎలుకలు హాస్టల్ గదుల్లోకి రంధ్రాల ద్వారా వచ్చేస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. దీనితో గదులు శుభ్రం చేయించి, ఎలుకలు రాకుండా యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఎలుకలు అత్యంత చాకచక్యంగా కొరుకుతాయని, నిద్రలో కొరికితే అవి కొరుకుతున్న విషయం కూడా తెలియదని వైద్యులు చెప్తున్నారు.