Home Page SliderNationalNewsNews AlertTrending Today

యోగికి బెదిరింపులు.. పోలీసుల వలలో చిక్కిన మహిళ

UP ముఖ్యమంత్రి  యోగీని హ‌త్య చేస్తామంటూ బెదిరింపు సందేశాలు పంపిన మ‌హిళను మ‌హారాష్ట్ర యాంటీ టెర్ర‌రిజ‌మ్ స్క్వాడ్, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థానేలోని ఉల్హాస్‌న‌గ‌ర్‌కు చెందిన ఫాతిమా ఖాన్ ఈ బెదిరింపు సందేశాలు పంపిన‌ట్టు గుర్తించి ఆమెను స్థానిక పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అయితే ఆమె మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు పోలీసులు తెలిపారు. త‌దుప‌రి విచారణ, ప‌రీక్ష‌ల నిమిత్తం ఆమెను ముంబైకి తరలించారు.