crimeHome Page SliderNationalTrending Today

వారి రహస్య స్థావరం స్వాధీనం..

జమ్మూకశ్మీర్‌లో ముమ్మరంగా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు ఉగ్రవాదులకు సంబంధించిన రహస్య స్థావరాన్ని కనిపెట్టారు. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో వారి రహస్య స్థావరాన్ని గుర్తించి, ధ్వంసం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. వారి ఆయుధాలు, పేలుడు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సెడోరి నాలా అటవీ ప్రాంతంలో ముష్కరులు సంచరిస్తున్నట్లు సమాచారం అందిన సైన్యం ఈ స్థావరాన్ని కనిపెట్టారు. కుల్గాం జిల్లాలో కూడా ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్టు చేశారు.