Home Page SliderTelangana

ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త

Share with

బెంగళూరు రూట్ ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ నుంచి బెంగళూరు మార్గంలో ప్రయాణించే వారి చార్జీల్లో ఆర్టీసీ డిస్కౌంట్ ఇచ్చింది. ఆ మార్గంలో ప్రయాణించే వారికి టీజీఎస్ఆర్టీసీ 10% రాయితీ కల్పించింది. బెంగళూరుకు నడిచే అన్ని సర్వీసులకు ఈ డిస్కౌంట్ వర్తింపు ఉంటుందని పేర్కొంది. ఏసీ స్లీపర్ (బెర్త్), ఏసీ స్లీపర్ స్టార్ (సీటర్), రాజధాని, నాన్ ఏసీ స్లీపర్ (బెర్త్), నాన్ ఏసీ సీటర్, సూపర్ లగ్జరీ బస్సుల్లో ఈ రాయితీ లభిస్తోంది. ఈ డిస్కౌంట్ తో ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ. 160 వరకు ఆదా అవుతుందని టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. వివరాలు, టికెట్ల రిజర్వేషన్ కోసం ఆర్టీసీ వెబ్ సైట్ www.tgsrtcbus.inను సంప్రదించాలని తెలిపింది.