Home Page SliderNational

మాజీ సీఎం కారుపై రాళ్ల దాడి

Share with

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రివాల్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన పోటీ చేస్తోన్న న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కేజీవాల్ ప్రచారం నిర్వహించారు. ప్రచారం ముగించుకుని వెళ్తుండగా కేజీవాల్ ప్రయాణిస్తోన్న కారుపై గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేశారు. మరికొందరు కేజీవాల్ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించగా వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని కేజీవాల్ ను అక్కడి నుండి పంపించారు.కేజీవాల్ కారుపై రాళ్ల దాడి జరిగిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఆప్, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. కేజీవాల్ కారుపై రాళ్ల దాడి ఘటనపై ఎక్స్ వేదికగా రియాక్ట్ అయిన ఆప్.. బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. న్యూఢిల్లీ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ కిరాయి గుండాలే కేజీవాల్ కారుపై రాళ్ల దాడి చేశారని ఆప్ ఆరోపించింది. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ఆప్ అధినేత కేజీవాల్ పై భౌతిక దాడులకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి దాడులకు కేజీవాల్ భయపడరని.. ఆయన మరింత ధైర్యంతో ప్రజల్లోకి వెళ్తారని స్పష్టం చేసింది. బీజేపీకి ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొంది.