దొంగ బంగారంతో అమెరికా మహిళకు 6 కోట్ల టోకరా
రాజస్థాన్లోని జైపూర్లోని జోహ్రీ బజార్లోని ఓ దుకాణంలో అమెరికా మహిళ చెరిష్, బంగారు పాలిష్తో కూడిన వెండి ఆభరణాలను కొనుగోలు చేసింది. రాజస్థాన్ షాప్ యజమాని ₹ 300 విలువైన కృత్రిమ ఆభరణాలను ₹ 6 కోట్లకు విక్రయించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమెరికా మహిళ చెరిష్ రాజస్థాన్లోని జైపూర్లోని జోహ్రీ బజార్లోని ఒక దుకాణంలో బంగారు పాలిష్తో కూడిన వెండి ఆభరణాలను కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో అమెరికాలో జరిగిన ఎగ్జిబిషన్లో ఈ ఆభరణాలను ప్రదర్శించగా, అవి నకిలీవని తేలింది. చెరిష్ భారతదేశానికి వచ్చి, షాప్ యజమాని గౌరవ్ సోనీని ప్రశ్నించింది.

కానీ అతను స్పందించకపోవడంతో అమెరికా మహిళ జైపూర్ పోలీసులను ఆశ్రయిచింది. అమెరికా రాయబార కార్యాలయం నుండి సహాయం కోరింది. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని జైపూర్ పోలీసులను అమెరికా అధికారులు కోరారు. 2022లో ఇన్స్టాగ్రామ్ ద్వారా గౌరవ్ సోనీతో చెరిష్కు పరిచయం ఏర్పడిందని.. గత రెండేళ్లుగా కృత్రిమ ఆభరణాల కోసం ₹ 6 కోట్లు చెల్లించినట్లు పోలీసుల విచారణలో తేలింది. గౌరవ్, అతని తండ్రి రాజేంద్ర సోనీ కోసం గాలిస్తున్నామని, వీరిద్దరూ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు చెప్పారు.