Home Page SliderNational

రాజస్థాన్‌లో పోలింగ్‌కు పెళ్లి ముహుర్తాల షాక్ – ఆందోళనలో అభ్యర్థులు

Share with

రాజస్థాన్ రాష్ట్రంలో పోలింగ్ ముహూర్తానికి  అక్కడ మంచి పెళ్లి ముహూర్తాలు షాక్ ఇవ్వనున్నాయి. పోలింగ్ జరిగే నవంబర్ 23 వ తేదీన వారి పర్వదినమైన దేవ్ ఉథాని ఏకాదశి. దీనితో ఆరోజు దాదాపు 50 వేల పైచిలుకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. దీనితో పోలింగ్ శాతం విపరీతంగా పడిపోవచ్చని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. హిందువులలో అన్ని కులాల వారికీ ఈ రోజు పరమ పవిత్రంగా భావిస్తారు. పెళ్లి అంటే మాటలా అనేక వృత్తుల వారు పెళ్లి పనుల్లో నిమిత్తమై ఉంటారు. వంటవాళ్లు క్యాటరర్లు, ఎలక్ట్రీషియన్లు, బ్యాండ్లు, పురోహితులు, డ్యాన్సర్లు, అలంకరణ పనుల వారు, పనివాళ్లు ఇలా అందరూ బిజీగా ఉంటారు. వేరే ఊర్లో పెళ్లిళ్లయితే ఊర్లకు కూడా వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని పెళ్లి మండపాలు బుక్ అయ్యాయని, వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతాయని ప్రముఖ ఈవెంట్ మేనేజర్ తెలిపారు. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలలో ఓటు విషయంలో చైతన్యం ఉందని ఓటింగ్ శాతానికి ప్రమాదం లేకుండా జాగ్రత్త పడవచ్చని సముదాయించినట్లు సమాచారం.