Home Page SliderNews AlertTelanganatelangana,viral

కుమురం భీం మనవడు కూలిపనికి..

ప్రఖ్యాత గిరిజన వీరుడు కుమురం భీం మనవడు కుమురం సోనేరావు కూలిపనికి వెళ్లడం సంచలనం కలిగిస్తోంది. తెలంగాణలోని కుమురం భీం అసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ మండలం దోబే గ్రామానికి చెందిన కుమురం సోనేరావు, ఆయన భార్య గౌరుబాయి కొద్ది రోజులుగా జీవనోపాధి లేక ఉపాధి హామీ పథకంలో కూలిపనికి వెళ్తున్నారు. తమను గుర్తించి, ప్రభుత్వం ఆదుకోవాలని, ఆసరా పింఛన్ అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం గతంలో ఐదెకరాల సాగుభూమి ఇచ్చినప్పటికీ, ఇల్లు లేదని, ఇంటి కోసం పలుమార్లు ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు దరఖాస్తులు సమర్పించామని పేర్కొన్నారు.