Home Page SliderTelangana

అక్రమమైతే నా ఇల్లు నేనే కూల్చేస్తాను..

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రాంచంద్రరావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తన ఫాం హౌస్ కు అధికారులను పంపించాలని, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో నిర్మాణం ఉంటే మార్క్ చేయాలని కోరారు. అది అక్రమ నిర్మాణమైతే 48 గంటల్లో సొంత ఖర్చులతో కూల్చేస్తానన్నారు. తనకు చట్టం నుంచి ఎలాంటి మినహాయింపులు వద్దని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదని, అలా వస్తే తన కాంగ్రెస్ రక్తం సహించదు అని అన్నారు.