NationalTelangana

దైవదర్శనంలో అపశృుతి..ఐదుగురు మృతి

Share with

కర్ణాటక సమీపంలోని బీదర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు కంటైనర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడి అక్కడే మృతి చెందగా మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతి చెందిన వారిని హైదరాబాద్ బేగం పేట వాసులుగా గుర్తించారు. కర్ణాటక కలబురిగి జిల్లా గంగాపూర్ దైవదర్శనానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో గిరిధర్ (45) , అనిత (30) , ప్రియ (15) , మహేష్ (2) , డ్రైవర్ జగదీష్ (30) లుగా గుర్తించారు.