గుజరాత్లో 1000 మంది..
ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్లోని అక్రమ వలసదారులని గుర్తించే పనిలో పడ్డాయి రాష్ట్రప్రభుత్వాలు. ఈ క్రమంలో గుజరాత్లో చేపట్టిన భారీ ఆపరేషన్లో 1000 మంది పట్టుబడ్డారు. వీరందరూ బంగ్లాదేశ్కు చెందినవారని సమాచారం. వీరంతా తప్పుడు ధ్రువ పత్రాలతో రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు గుజరాత్ హోంమంత్రి పేర్కొన్నారు. అహ్మదాబాద్లో 890 మంది, సూరత్లో 134 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరు పశ్చిమ బెంగాల్ నుండి సరిహద్దులు దాటి దేశంలో ప్రవేశించారు. వారిలో కొందరు డ్రగ్స్, మానవ అక్రమ రవాణా కేసులలో ఉన్నారని, ఇద్దరు ఆల్ఖైదా స్లీపర్ సెల్స్తో కలిసి పనిచేస్తున్నట్లు గుర్తించారు. అలాగే పాక్ జాతీయులు ఉంటే వారు వెంటనే గుజరాత్ వీడి వెళ్లాలని హెచ్చరించారు.